అబుధాబి-జైపూర్ ఎయిర్ అరేబియా విమాన సర్వీస్
- April 08, 2022
అబుధాబి: యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్కు ఈ కొత్త సర్వీస్ను నడపనుంది.ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి ఈ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా ప్రకటించింది.ఈ మేరకు గురువారం విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది.భారత్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైనా, ఎన్నో అద్భుత కట్టడాలతో వారసత్వ సంపదకు నెలవుగా ఉన్న పింక్ సిటీ జైపూర్కు కొత్త సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, జూలై 2020లో అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యారియర్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుండి ఇది ఎయిర్ అరేబియాకు 18వ రూట్గా తెలిపింది. కస్టమర్లు ఈ సర్వీసుకు సంబంధించిన విమాన టికెట్ల కోసం ఎయిర్ అరేబియా అధికారి వెబ్సైట్ https://www.airarabia.com/ లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
--సుమన్ కోలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









