అబుధాబి-జైపూర్ ఎయిర్ అరేబియా విమాన సర్వీస్
- April 08, 2022
అబుధాబి: యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్కు ఈ కొత్త సర్వీస్ను నడపనుంది.ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి ఈ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా ప్రకటించింది.ఈ మేరకు గురువారం విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది.భారత్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైనా, ఎన్నో అద్భుత కట్టడాలతో వారసత్వ సంపదకు నెలవుగా ఉన్న పింక్ సిటీ జైపూర్కు కొత్త సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, జూలై 2020లో అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యారియర్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుండి ఇది ఎయిర్ అరేబియాకు 18వ రూట్గా తెలిపింది. కస్టమర్లు ఈ సర్వీసుకు సంబంధించిన విమాన టికెట్ల కోసం ఎయిర్ అరేబియా అధికారి వెబ్సైట్ https://www.airarabia.com/ లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
--సుమన్ కోలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









