కొత్త మంత్రుల విషయంలో మనసు మార్చుకున్న ఏపీ సీఎం జగన్..
- April 08, 2022
అమరావతి: కొత్త మంత్రివర్గం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. పాత మంత్రుల్లో కేవలం ముగ్గురు , నలుగుర్ని మాత్రమే తీసుకొని , మిగతా వారందర్ని కొత్తవారిని తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గత మంత్రి వర్గంలో పని చేసిన 7 నుండి 11 మంది వరకు తీసుకోవాలని అనుకుంటున్నారట. సీనియారిటీకి చోటు కల్పించాలని ఆలోచన లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యంగా… అనుభవం కోటాలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వీరికి మరోసారి ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది చూడాలి. నిన్న గురువారం 24 మంది మంత్రులు రాజీనామా చేసి , జగన్ కు అప్పగించారు. ఈరోజు ఆ రాజీనామా పత్రాలను గవర్నర్కు సమర్పించారు. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







