సౌదీలో పెరిగిన ఆర్థిక మోసాలు

- April 14, 2022 , by Maagulf
సౌదీలో పెరిగిన ఆర్థిక మోసాలు

సౌదీ: 2021లో ఆర్థిక మోసాలు పెరిగాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) తెలిపింది. ఆ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.  2021 సంవత్సరానికి సంబంధించిన SAMA విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ప్రజల బ్యాంకింగ్ డేటా,  వ్యక్తిగత ఆధారాలను పొందేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. SAMA బ్యాంక్ క్లయింట్‌లు మోసానికి వ్యతిరేకంగా అత్యంత జాగ్రత్త వహించాలని సూచించింది. పాస్‌వర్డ్ లు, PINల వంటి బ్యాంక్, వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయవద్దని కోరింది. కస్టమర్‌లు వెబ్‌సైట్‌ల విశ్వసనీయతను నిర్ధారించుకున్నాకే ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com