యూఏఈలో 5 రోజులపాటు ఈద్ సెలవులు.. బాణసంచాతో జాగ్రత్త

- April 16, 2022 , by Maagulf
యూఏఈలో 5 రోజులపాటు ఈద్ సెలవులు.. బాణసంచాతో జాగ్రత్త

యూఏఈ:  5 రోజులపాటు ఈద్ సెలవులు ఉన్నందునా తల్లిదండ్రులు తమ పిల్లలను పటాకులతో ఆడనివ్వవద్దని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. యువకులు సాధారణంగా బాణసంచా కాల్చి ఈద్ అల్ ఫితర్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రమాదాలు, జాగ్రత్తలను తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. బాణసంచా వినియోగానికి సంబంధించి దేశంలోని చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే Dh100,000 వరకు జరిమానా విధిస్తామని గత సంవత్సరం అధికారులు ప్రకటించారు. గతంలో ఎవరైనా పటాకుల వ్యాపారం చేసినా, తయారు చేసినా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. బాణాసంచా పేలుడు పదార్థంగా పరిగణించబడుతున్నందున వాటిని ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com