యూఏఈలో 5 రోజులపాటు ఈద్ సెలవులు.. బాణసంచాతో జాగ్రత్త
- April 16, 2022
యూఏఈ: 5 రోజులపాటు ఈద్ సెలవులు ఉన్నందునా తల్లిదండ్రులు తమ పిల్లలను పటాకులతో ఆడనివ్వవద్దని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. యువకులు సాధారణంగా బాణసంచా కాల్చి ఈద్ అల్ ఫితర్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రమాదాలు, జాగ్రత్తలను తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. బాణసంచా వినియోగానికి సంబంధించి దేశంలోని చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే Dh100,000 వరకు జరిమానా విధిస్తామని గత సంవత్సరం అధికారులు ప్రకటించారు. గతంలో ఎవరైనా పటాకుల వ్యాపారం చేసినా, తయారు చేసినా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. బాణాసంచా పేలుడు పదార్థంగా పరిగణించబడుతున్నందున వాటిని ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!









