కువైట్లో 3 వేల మంది అరెస్టు
- April 04, 2016
కువైట్లో వీసా గడువు ముగిసిన, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారం వ్యవధిలో దాదాపు మూడు వేల మంది కార్మికులను అరెస్టు చేశారని అక్కడి తెలుగువారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన కార్మికులు, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్ తదితర దేశాలకు చెందినవారు కువైట్కు వలస వెళుతుంటారు. కంపెనీ వీసాపై కువైట్కు వెళ్లినా యాజమాన్యం ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించకపోవడంతో పాస్పోర్టు, వీసాలను వదలి బయటకు వచ్చి దొరికిన పని చేసుకుంటున్నారు.వీసా, వర్క్ పర్మిట్ లేకుండా వేలాది మంది విదేశీయులు పనులు చేస్తున్నారన్న కారణంతో కువైట్ ప్రభుత్వం ఇటీవల ఏరివేత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు నెలల నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తమదేశంలో ఉంటున్నారని దాదాపు 45 వేల మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. వారం నుంచి తనిఖీల తీవ్రత పెంచారు. ఈ విషయాన్ని మోర్తాడ్ మం డలం ఏర్గట్లకు చెందిన ఆనందం గంగేశ్వర్ 'సాక్షి'కి ఫోన్లో వివరించారు. ఆయన కువైట్ బల్దియాలో పని చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది కువైట్లో కల్లివెల్లి అయ్యారని పేర్కొన్నారు. అరెస్టు అయినవారిలో కొంత మంది జరిమానా చెల్లించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కొంత మంది జైళ్లో ఉన్నారని ఇటీవల కువైట్ నుంచి ఇంటికి వచ్చిన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ వాసి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మన కార్మికులను ఇళ్లకు చేర్పించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







