ఏంటో ఈసారి అస్సలు కలిసిరావట్లేదు..ఓటమిపై రోహిత్ శర్మ
- April 25, 2022
ముంబై : ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో గత రాత్రి జరిగిన మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓడిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ పై ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను చెప్పారు. తమ ముందు లక్నో జట్టు ఉంచిన లక్ష్యం ఎక్కువేమీ కాదన్నాడు. అయితే తమ బ్యాటర్లు రాణించలేకపోయారని చెప్పాడు. వారు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టడం తమకు నష్టం తెచ్చిపెట్టిందన్నాడు.
తమ బ్యాటర్లలో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. లక్నో జట్టులోని బ్యాటర్లు అలాంటి బాధ్యత తీసుకున్నారని, దీంతో తమకు ఓటమి తప్పలేదన్నాడు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ ఉన్నప్పటికీ తమ బౌలర్లు మాత్రం బాగా రాణించారని పేర్కొన్నాడు. ఏమైనా, ఈ ఐపీఎల్ సీజన్ తమకు అస్సలు కలిసి రావడం లేదని.. ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అన్నాడు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







