ఏంటో ఈసారి అస్సలు కలిసిరావట్లేదు..ఓటమిపై రోహిత్ శర్మ
- April 25, 2022
ముంబై : ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో గత రాత్రి జరిగిన మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓడిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ పై ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను చెప్పారు. తమ ముందు లక్నో జట్టు ఉంచిన లక్ష్యం ఎక్కువేమీ కాదన్నాడు. అయితే తమ బ్యాటర్లు రాణించలేకపోయారని చెప్పాడు. వారు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టడం తమకు నష్టం తెచ్చిపెట్టిందన్నాడు.
తమ బ్యాటర్లలో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. లక్నో జట్టులోని బ్యాటర్లు అలాంటి బాధ్యత తీసుకున్నారని, దీంతో తమకు ఓటమి తప్పలేదన్నాడు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ ఉన్నప్పటికీ తమ బౌలర్లు మాత్రం బాగా రాణించారని పేర్కొన్నాడు. ఏమైనా, ఈ ఐపీఎల్ సీజన్ తమకు అస్సలు కలిసి రావడం లేదని.. ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అన్నాడు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







