గుజరాత్లో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
- April 25, 2022గుజరాత్:భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో..పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకుంది. పాకిస్తాన్కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. భారత తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకుంది . భారత్ వైపు వస్తున్న పాకిస్తాన్కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్ను చేపట్టారు.
రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్లో హెరాయిన్ను అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థానీ బోట్ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..