షూటింగ్లో హీరో గోపీచంద్కి ప్రమాదం..
- April 29, 2022మైసూరు: హీరో గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో చాలా రోజుల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ఇది రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది.అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా కేవలం బెణికింది, ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటనపై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం