షూటింగ్లో హీరో గోపీచంద్కి ప్రమాదం..
- April 29, 2022
మైసూరు: హీరో గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో చాలా రోజుల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ఇది రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది.అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా కేవలం బెణికింది, ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటనపై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







