యాదగిరిగుట్టలో ఘోరం..భవనం కూలి నలుగురు మృతి..

- April 29, 2022 , by Maagulf
యాదగిరిగుట్టలో ఘోరం..భవనం కూలి నలుగురు మృతి..

తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భవనం ఉన్నట్టుండి ఎలా కూలిపోయిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది పురాతన భవనమా లేక నిర్మాణం సరిగ్గా చేపట్టని భవనమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ భవనం పరిధిలో దుకాణ సముదాయాలు ఉండటంతో.. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఊహించని పరిణామాంతో స్థానికులు, బాధిత కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. పురాతన భవనం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. నీటి లీకేజీ కారణంగా బిల్డింగ్ నిర్మాణం బలహీనపడి ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను, గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అధికారులు.. ఘటనపై విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com