యాదగిరిగుట్టలో ఘోరం..భవనం కూలి నలుగురు మృతి..
- April 29, 2022
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భవనం ఉన్నట్టుండి ఎలా కూలిపోయిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది పురాతన భవనమా లేక నిర్మాణం సరిగ్గా చేపట్టని భవనమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ భవనం పరిధిలో దుకాణ సముదాయాలు ఉండటంతో.. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఊహించని పరిణామాంతో స్థానికులు, బాధిత కుటుంబాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. పురాతన భవనం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. నీటి లీకేజీ కారణంగా బిల్డింగ్ నిర్మాణం బలహీనపడి ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను, గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అధికారులు.. ఘటనపై విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







