యాదగిరిగుట్టలో ఘోరం..భవనం కూలి నలుగురు మృతి..
- April 29, 2022తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భవనం ఉన్నట్టుండి ఎలా కూలిపోయిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది పురాతన భవనమా లేక నిర్మాణం సరిగ్గా చేపట్టని భవనమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ భవనం పరిధిలో దుకాణ సముదాయాలు ఉండటంతో.. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఊహించని పరిణామాంతో స్థానికులు, బాధిత కుటుంబాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. పురాతన భవనం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. నీటి లీకేజీ కారణంగా బిల్డింగ్ నిర్మాణం బలహీనపడి ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను, గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అధికారులు.. ఘటనపై విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!