ఉగాదికి 'బాబు బంగారం'చిత్రం' ఫస్ట్ లుక్...
- April 05, 2016
వెంకటేష్, నయనతార నాయకా నాయికలుగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్ సంయుక్తంగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. 'వెంకటేష్, నయనతార మూడవ సారి జోడీ కడుతున్న చిత్రమిది. గతంలో 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో కలిసి నటించారు. ఆ చిత్రాలు ఘన విజయం సాధించినట్లుగానే ఈ సినిమా కూడా అదే తరహాలో పెద్ద హిట్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఫస్ట్లుక్ని ఉగాది పర్వదిన శుభ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు మారుతి సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జులైలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







