అసని ఎఫెక్ట్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 37 రైళ్లు రద్దు..
- May 11, 2022
అసని తూఫాన్ ఎఫెక్ట్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 37 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను మచిలీపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ తుఫాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు చేయగా… విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు, విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసింది రైల్వే శాఖ. మరి కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసింది రైల్వేశాఖ.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్









