రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- February 17, 2026
మనామా: పవిత్ర రమదాన్ మాసం కోసం బహ్రెయిన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. నిత్యవసరాల మార్కెట్ ను నియంత్రించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటనలను ముమ్మరం చేస్తోంది. రాజ్య వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలలో తనిఖీలను మొదులుపెట్టింది. అదే సమయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రమదాన్ సందర్భంగా పలు దుకాణాలు ప్రకటించిన డిస్కౌంట్లు, ఆఫర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే పద్ధతులు, వాణిజ్య మోసాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.
రమదాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులు, పండ్లు మరియు కూరగాయల దుకాణాలు, మాంసం మరియు చేపల మార్కెట్లు, టైలరింగ్ సేవలు, బంగారు దుకాణాలు మరియు స్వీట్ రిటైలర్లు వంటి అధిక డిమాండ్ ఉన్న కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.
తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలను గుర్తిస్తే.. జరిమానాలతోపాటు లైసెన్సుల రద్దు వంటి కఠినమైన చర్యలకు వెనుకాడబోమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. వినియోగదారులు జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ తవాసుల్ ద్వారా, 17111225లో వాట్సాప్ ద్వారా లేదా [email protected] ఇమెయిల్ ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









