రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- February 17, 2026
మనామా: పవిత్ర రమదాన్ మాసం కోసం బహ్రెయిన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. నిత్యవసరాల మార్కెట్ ను నియంత్రించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటనలను ముమ్మరం చేస్తోంది. రాజ్య వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలలో తనిఖీలను మొదులుపెట్టింది. అదే సమయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రమదాన్ సందర్భంగా పలు దుకాణాలు ప్రకటించిన డిస్కౌంట్లు, ఆఫర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే పద్ధతులు, వాణిజ్య మోసాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.
రమదాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులు, పండ్లు మరియు కూరగాయల దుకాణాలు, మాంసం మరియు చేపల మార్కెట్లు, టైలరింగ్ సేవలు, బంగారు దుకాణాలు మరియు స్వీట్ రిటైలర్లు వంటి అధిక డిమాండ్ ఉన్న కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.
తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలను గుర్తిస్తే.. జరిమానాలతోపాటు లైసెన్సుల రద్దు వంటి కఠినమైన చర్యలకు వెనుకాడబోమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. వినియోగదారులు జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ తవాసుల్ ద్వారా, 17111225లో వాట్సాప్ ద్వారా లేదా [email protected] ఇమెయిల్ ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









