మాస్కుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్న మోసగాళ్లు
- May 12, 2022
బహ్రెయిన్: మనామాలోని పలు ప్రాంతాలలో మాస్కులు ధరించనందుకు మోసగాళ్ల బృందం కార్మికుల నుండి జరిమానాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మోసగాళ్లు తమను తాము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బందిగా చెప్పుకుంటూ.. జరిమానా చెల్లించని పక్షంలో కార్మికులను కటకటాల వెనక్కి నెట్టివేస్తామని బెదిరిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భయంతో కార్మికులు BD5, BD10 మధ్య జరిమానాలు చెల్లిస్తున్నారు. అమాయక కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. కోవిడ్ -19 నియమాలు, నిబంధనలలో మార్పుల గురించి వారికి ఎక్కువగా తెలియకపోవడంతో వారు సులభంగా మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







