మాస్కుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్న మోసగాళ్లు
- May 12, 2022
బహ్రెయిన్: మనామాలోని పలు ప్రాంతాలలో మాస్కులు ధరించనందుకు మోసగాళ్ల బృందం కార్మికుల నుండి జరిమానాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మోసగాళ్లు తమను తాము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బందిగా చెప్పుకుంటూ.. జరిమానా చెల్లించని పక్షంలో కార్మికులను కటకటాల వెనక్కి నెట్టివేస్తామని బెదిరిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భయంతో కార్మికులు BD5, BD10 మధ్య జరిమానాలు చెల్లిస్తున్నారు. అమాయక కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. కోవిడ్ -19 నియమాలు, నిబంధనలలో మార్పుల గురించి వారికి ఎక్కువగా తెలియకపోవడంతో వారు సులభంగా మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









