చొరబాటుదారులకు అనుమతిస్తే SR1 మిలియన్ జరిమానా, 15 ఏళ్ళ జైలు శిక్ష
- May 12, 2022
రియాద్: చొరబాటుదారులు సౌదీ అరేబియాలోకి చొరబడటానికి అనుమతించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి వాటిని అరెస్టు చేయవలసిన ప్రధాన నేరాలలో ఒకటిగా పరిగణిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. చొరబాటుదారున్ని ఏ విధంగానైనా రాజ్యంలోకి అనుమతించే వ్యక్తిని అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. చొరబాటుదారులు రాజ్యంలోకి చొరబడటానికి వీలు కల్పించే వారికి SR1 మిలియన్ వరకు జరిమానా, అలాగే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు చొరబాటుదారుడికి ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిమానాలు 7/27/1442 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ A/406, 7/2/1443 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ 7975 ప్రకారం విధించబడతాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు







