చొరబాటుదారులకు అనుమతిస్తే SR1 మిలియన్ జరిమానా, 15 ఏళ్ళ జైలు శిక్ష
- May 12, 2022
రియాద్: చొరబాటుదారులు సౌదీ అరేబియాలోకి చొరబడటానికి అనుమతించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి వాటిని అరెస్టు చేయవలసిన ప్రధాన నేరాలలో ఒకటిగా పరిగణిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. చొరబాటుదారున్ని ఏ విధంగానైనా రాజ్యంలోకి అనుమతించే వ్యక్తిని అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. చొరబాటుదారులు రాజ్యంలోకి చొరబడటానికి వీలు కల్పించే వారికి SR1 మిలియన్ వరకు జరిమానా, అలాగే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు చొరబాటుదారుడికి ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిమానాలు 7/27/1442 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ A/406, 7/2/1443 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ 7975 ప్రకారం విధించబడతాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









