మహేష్ అలా.. అడవి శేష్ ఇలా.. కెలుక్కుంటున్నారెందుకబ్బా.!
- May 13, 2022
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ నన్ను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యల ద్వారా బాలీవుడ్కి మహేష్ టార్గెట్ అయిపోయాడంటూ ప్రచారం కూడా జరిగుతోంది. ఇదిలా వుంటే, టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ హాలీవుడ్ని కెలికాడు తాజాగా.
హాలీవుడ్ హీరోలా కనిపిస్తావ్ కదా.. అమెరికాలోనే పుట్టి పెరిగారు కదా.. ఎందుకు హాలీవుడ్ సినిమాల్లో నటించే సాహసం చేయలేదు.? అని ఓ ఇంటర్వ్యూలో అడవి శేష్ని ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సమాధానంగా అడవి శేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
హాలీవుడ్లో ఇండియన్ ఆర్టిస్టులను చాలా చీప్గా చూస్తారనీ, టెర్రరిస్టు పాత్రలూ లేదంటే, పెట్రోల్ బంక్లో పని చేసే తరహా పాత్రలనే ఇస్తారనీ చెప్పుకొచ్చాడు. ఇండియన్ అనేవాడు అమెరికాలో హీరో అవడం సాధ్యం కాదనీ తేల్చేశాడు అడవి శేష్. అంతేకాదు, అక్కడ పాపులర్ అయిన ఇండియన్ ఆర్టిస్టులంతా కేవలం కమెడియన్ రోల్స్కే పరిమితమయ్యారని కూడా వ్యాఖ్యానించాడు.
ఎందుకింతలా అడవి శేష్ హాలీవుడ్ని కెలుక్కున్నాడో ఏమో కానీ, ఆయన తాజా చిత్రం ‘మేజర్’ జూన్ 3న విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమాని మహేష్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేరళకు చెందిన రక్షణ శాఖ అధికారి సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత గాధ ఆధారంగా రూపొందుతోంది.
బహుశా ఈ సినిమాకి స్పెషల్ పబ్లిసిటీ అద్దాలన్న ఆలోచనతోనే హాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కాబోలు అడవి శేష్. ఏదైతేనేం, అడవి శేష్ వ్యాఖ్యలు ఒకింత ఇంట్రెస్టింగ్గానే వున్నాయ్. కానీ, ఎవరి మనో భావాలూ దెబ్బ తినకుండా వుండాలి మరి.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







