ముగ్గురు ఉగ్రవాదులను ఉరితీసిన సౌదీ
- May 15, 2022
రియాద్: ఉగ్రవాద ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులను సౌదీ అరేబియా ఉరితీసింది. ఇందులో ఇద్దరు సౌదీలు, ఒక యెమెన్ ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌదీ జాతీయుడైన మహమ్మద్ బిఎన్ ఖిదిర్ బిన్ హషీమ్ అల్-అవామీ ఉగ్రవాద టీంలో చేరి, భద్రతకు విఘాతం కలిగించడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్-అవామీ తన ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను దాచడం, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఆర్పీజీలు, మోలోటోవ్ కాక్టెయిల్లు, పరికరాలను కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మరో సౌదీ జాతీయుడు హుస్సేన్ బిఎన్ అలీ అల్ బు-అబ్దుల్లా కూడా ఉగ్రవాదులతో కలిసి పనిచేసినందుకు, భద్రతా దళాల సభ్యుడిని కాల్చి చంపినందుకు, రాజ్యంలో భద్రతకు భంగం కలిగించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించి దాచడం వంటి చేయడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినందుకు దోషిగా తేలాడని తెలిపింది. యెమెన్ జాతీయుడైన మహమ్మద్ అబ్దుల్బాసేట్ అల్-ముల్లామి ఇరాన్-మద్దతుగల హౌతీ మిలీషియాలో చేరి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి చట్టవిరుద్ధంగా రాజ్యంలోకి ప్రవేశించినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రిమినల్ కోర్ట్ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. ఈ తీర్పును అప్పీల్ కోర్టు, సుప్రీంకోర్టు ఆమోదించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







