రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితున్ని విడుదల చేయాలనీ తీర్పు
- May 18, 2022
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్ను జైలు నుంచి విడుదల చేయాలనీ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 31 ఏళ్లుగా ఏజీ పెరరివాలన్ జైల్లో ఉన్నాడు. ఈ తరుణంలో క్షమాభిక్ష అభ్యర్థనపై ఏజీ పెరరివాలన్ విడుదల చేస్తూ సుప్రీం కోర్ట్ నిర్ణయం తీసుకుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం అధికారాన్ని ఉపయోగించుకుని.. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరారివాలన్ మరియు ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ను కోరింది. అయితే, గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి సూచించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 సంవత్సరాలు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఇక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







