భారత్లో తొలి 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ సక్సెస్
- May 20, 2022
న్యూ ఢిల్లీ: దేశీయంగా అభివృధ్ది చేసిన 5G టెక్నాలజీతో మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ విజయవంతంగా పరీక్షించామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
కాల్ అనంతరం “ఆత్మనిర్భర్ 5జీ.. ఐఐటీ మద్రాస్ లో 5జీ కాల్ను విజయవంతంగా పరీక్షించామని.. ఈ నెట్ వర్క్ పూర్తిగా భారతదేశంలోనే అభివృధ్ది చేశారని” ఆయన నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్ధ్యం సాధించాలన్న ప్రధాని మోదీ కోరిక దీనితో తీరినట్లు ఆయన పేర్కోన్నారు.
5జీ టెక్నాలజీ సొల్యూషన్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్ ను ఐఐటీ మద్రాస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







