హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

- May 26, 2022 , by Maagulf
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మోడీకి.. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు వెళ్లనున్నారు. భాగ్యనగరానికి మోడీ రాకతో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. మరోవైపు.. పులి వేషాలు, డప్పు సప్పులతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com