ఇండియాను ఫాలో అవుతున్న పాక్
- May 30, 2022
మన దాయాది దేశం గుడ్డిగా మనల్ని ఫాలో అవుతోంది. ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకే కేంద్రం ముడి చమురును కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఇండియాకు మేలు జరుగుతోంది.
అయితే యుద్ధ సమయంలో రష్యా నుంచి ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ కొనుగోలును నిలిపేస్తున్న సమయంలో ఇండియా కొనుగోలు చేయడం విమర్శలపాలైంది. అయినా సరే.. మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం అనుకున్న ఇండియా.. రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. తన స్టాండ్పై ఇండియా గట్టిగా నిలబడింది.
ఈ విదేశాంగ విధానాన్ని గతంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తెగ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ దేశం మన ఇండియాను ఫాలో అవుతోంది. దాయాది దేశం పాకిస్తాన్ కూడా భారత్ తరహాలోనే రష్యా నుంచి చమురు కొనాలని నిర్ణయించింది. పాక్లోని చమురు కొరతను అధిగమించేందుకు పాక్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోబోతోంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
అంతే కాదు.. కేవలం పెట్రోల్ , డీజిల్ మాత్రమే కాదు.. కొన్ని ఆహార పదార్థాలను సైతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికర్ ఓ ప్రకటన ఇచ్చారు. పాక్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్వేచ్ఛా వాణిజ్యం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య బంధాల విస్తరణపై పాకిస్తాన్కు స్పష్టత ఉందని సదరు విదేశాంగ ప్రతినిధి అంటున్నారు. పాక్ దేశ అవసరాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయంటున్నారు.
చమురు కొరత కారణంగా పాకిస్తాన్ ఇటీవల పెట్రో ఉత్పత్తుల ధరలను బాగా పెంచేసింది. ఏకంగా లీటరుకు ఏకంగా 30 రూపాయలు పెచింది. ఈ పెంపుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి భారత్ చవకగా చమురుని దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు పాక్ కూడా మేలుకొంది. తాను కూడా రష్యా చమురు కొనుగోలుకు సిద్ధమైంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







