అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో అమ్మెనియా లీక్‌.. మహిళలకు అస్వస్థత

- June 03, 2022 , by Maagulf
అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో అమ్మెనియా లీక్‌.. మహిళలకు అస్వస్థత

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్ పరిధిలోని పోరస్‌ కంపెనీలో అమ్మోనియా వాయువు లీకైంది.

దీంతో సమీపంలోని సీడ్స్‌ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు రావడంతో పాటు వాంతులు అయ్యాయి. పదుల సంఖ్యలో మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. అమ్మెనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పిపోయారని.. ప్రాణాపాయం ఉండదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్‌ కంపెనీలో అమ్మోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com