దేశీయ యాత్రికుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- June 04, 2022
మక్కా: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే స్థానిక యాత్రికులు, పౌరులు, నివాసితుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్టు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 65 కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండకూడదని, చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతిని కలిగి ఉండాలని స్పష్టం చేసింది. గతంలో హజ్ చేయని, తవక్కల్నా అప్లికేషన్లో వారి స్థితిని బట్టి పూర్తిగా రోగనిరోధక శక్తిని పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాత్రికులు అందుబాటులో ఉన్న అన్ని ప్యాకేజీలను సమీక్షించడానికి లేదా https://localhaj.haj.gov.saలో ఆన్లైన్లో ఈట్మార్నా అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తుదారులందరూ తమ డేటాను నమోదు చేసేటప్పుడు.. ప్యాకేజీలను ఎంచుకున్నప్పుడు వారు అందించే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత అన్ని దరఖాస్తులు ప్రాసెస్ చేయబడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అన్ని విచారణలు, సూచనలను ఇ-మెయిల్ ద్వారా [email protected], నంబర్ 920002814 లేదా ట్విట్టర్ ఖాతా @MOHU ద్వారా పంపవచ్చని వెల్లడించింది. కోఆర్డినేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సయీద్ అల్-జుహానీ మాట్లాడుతూ.. 77 దేశీయ కంపెనీలు ఈ సంవత్సరం పనిచేయనున్నాయని.. అవి యాత్రికులకు భోజనాన్ని, టెంట్లు, విద్యుత్ సహా వివిధ సేవలను అందిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







