భారతీయుల అప్లికేషన్లే అధికం వాషింగ్టన్
- April 08, 2016
హెచ్-1బీ వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రస్తుత సంవత్సరంలో జారీ చేయనున్న 65 వేల వీసాల కోసం 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. అంటే జారీ చేయాలనుకున్న వీసాల కంటే నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.అమెరికాలో పనిచేయడానికి అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులకోసం హెచ్-1బీ వీసాలను అక్కడి ప్రభుత్వం ప్రతియేటా జారీ చేస్తుంది. అమెరికాలో ఎస్టీఈఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్యమేటిక్స్)లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వీసా అందించనున్నది. ఏప్రిల్ 1నాటికి వీసాకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి దరఖాస్తులను స్వీకరించిన యూఎస్సీఐఎస్.. యాదృచ్చిక ఎంపిక ప్రక్రియ తేదిని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. గతేడాది 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









