భారతీయుల అప్లికేషన్లే అధికం వాషింగ్టన్
- April 08, 2016
హెచ్-1బీ వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రస్తుత సంవత్సరంలో జారీ చేయనున్న 65 వేల వీసాల కోసం 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. అంటే జారీ చేయాలనుకున్న వీసాల కంటే నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.అమెరికాలో పనిచేయడానికి అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులకోసం హెచ్-1బీ వీసాలను అక్కడి ప్రభుత్వం ప్రతియేటా జారీ చేస్తుంది. అమెరికాలో ఎస్టీఈఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్యమేటిక్స్)లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వీసా అందించనున్నది. ఏప్రిల్ 1నాటికి వీసాకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి దరఖాస్తులను స్వీకరించిన యూఎస్సీఐఎస్.. యాదృచ్చిక ఎంపిక ప్రక్రియ తేదిని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. గతేడాది 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







