అమర్నాథ్యాత్రకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి
- April 09, 2016
పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. జూలై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అమరనాథ్ ఆలయ బోర్డు సీఈఓ పీకే త్రిపాఠి మాట్లాడుతూ... ఇప్పటికే ముందస్తు రిజిస్ట్రేషన్లు లక్ష మార్కును దాటేశాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 432 బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు.48 రోజుల పాటు మాత్రమే ఉండే ఈ యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 18 రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని చెప్పారు. రోజుకు 7,500 మంది భక్తులు చొప్పున మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తామని చెప్పారు. పహల్గామ్, బల్టల్ మార్గాల ద్వారా అమర్నాథ్ ఆలయం వద్దకు భక్తుల్ని పంపిస్తామని తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు సంబంధిత బ్యాంకు బ్రాంచీల వివరాల్ని తెలుసుకోవాలనుకుంటే తమ ఆలయ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









