అమర్నాథ్యాత్రకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి
- April 09, 2016
పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. జూలై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అమరనాథ్ ఆలయ బోర్డు సీఈఓ పీకే త్రిపాఠి మాట్లాడుతూ... ఇప్పటికే ముందస్తు రిజిస్ట్రేషన్లు లక్ష మార్కును దాటేశాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 432 బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు.48 రోజుల పాటు మాత్రమే ఉండే ఈ యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 18 రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని చెప్పారు. రోజుకు 7,500 మంది భక్తులు చొప్పున మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తామని చెప్పారు. పహల్గామ్, బల్టల్ మార్గాల ద్వారా అమర్నాథ్ ఆలయం వద్దకు భక్తుల్ని పంపిస్తామని తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు సంబంధిత బ్యాంకు బ్రాంచీల వివరాల్ని తెలుసుకోవాలనుకుంటే తమ ఆలయ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









