అమర్నాథ్యాత్రకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి
- April 09, 2016
పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. జూలై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అమరనాథ్ ఆలయ బోర్డు సీఈఓ పీకే త్రిపాఠి మాట్లాడుతూ... ఇప్పటికే ముందస్తు రిజిస్ట్రేషన్లు లక్ష మార్కును దాటేశాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా మొత్తం 432 బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు.48 రోజుల పాటు మాత్రమే ఉండే ఈ యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 18 రక్షాబంధన్ రోజుతో ముగుస్తుందని చెప్పారు. రోజుకు 7,500 మంది భక్తులు చొప్పున మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తామని చెప్పారు. పహల్గామ్, బల్టల్ మార్గాల ద్వారా అమర్నాథ్ ఆలయం వద్దకు భక్తుల్ని పంపిస్తామని తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు సంబంధిత బ్యాంకు బ్రాంచీల వివరాల్ని తెలుసుకోవాలనుకుంటే తమ ఆలయ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







