"రస్ అల్ ఖైమా" లో ఉగాది వేడుకలు
- April 09, 2016
రస్ అల్ ఖైమా లో సితార వసుధైక కుటుంబం వారు ఉగాది వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. "RAK Ceramics"లో ఉద్యోగం చేస్తున్న 1100 మంది తెలుగు వారంతా కలిసి "సితార - వసుధైక కుటుంబం" పేరుతో ఒక తెలుగు కమ్మ్యూనిటీ ని ASA Prasad (RAK Ceramics GM), Bala Brahmaiah (RAK Ceramics DGM) గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిసారిగా ఉగాది వేడుకలను లో దిగ్విజయంగా జరపడం గమనార్హం.
ప్రముఖ జ్యోతిష మహా సిద్ధాంతి, భక్తీ టి.వి మరియు ఈ టి.వి లలో రాశిఫలాలు వివరించే ప్రసిద్ధ జ్యోతిష్కులు శ్రీ.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు దుర్ముఖి నామ సంవత్సర పంచాంగం చదివి వినిపించారు.
ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు యు.ఏ.ఈ ప్రార్ధనా గీతం మరియు "మా తెలుగు తల్లి" గీతంతో వేడుకలు ప్రారంభించడమే కాకుండా కూచిపూడి భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, భక్తీ గీతాలు, తంబోలా వంటి ఆటపాటలతో పాటు, ఇండియా నుంచి వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ ఫణి మాధవ్ గారి ప్రోగ్రాం అందరినీ అలరించింది.
చివరగా వేడుకలకు వచ్చిన ఆత్మీయులను, పెద్దలను ఘనంగా సత్కరించి సన్మానించారు.




తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









