కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- June 21, 2022
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ వల్ల కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం సాఫీగా సాగనుంది. బాలానగర్ వైపు నుంచి వచ్చే వారికి ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కాగా, సనత్నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







