అపాచీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ భూమి పూజ
- June 23, 2022అమరావతి: సీఎం జగన్ నేడు శ్రీ బాలాజీ జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. రూ.800 కోట్లతో ఇనగలూరులో లెదర్ యూనిట్ను నెలకొల్పేందుకు అపాచీ ముందుకు వచ్చింది.తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నఈ సంస్థ … రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది.ఈ యూనిట్లో ఆడిదాస్ షూస్, లెదర్ జాకెట్లు, లెదర్ బెల్టులను అపాచీ తయారు చేయనుంది.
ఈ యూనిట్కు భూమి పూజ చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అపాచీ పరిశ్రమతో కొత్తగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే దక్కనున్నాయని ఆయన తెలిపారు. 2023 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు.
ఇదిలా ఉంటే… ఈ పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలోనూ జగన్ పాలుపంచుకున్నారు. అనంతరం తిరుపతిలో టీసీఎల్ గ్రూప్నకు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ తదితర కంపెనీలకు భూమి పూజ చేశారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్