బహ్రెయిన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు
- April 10, 2016
గ్యాస్ లీకేజీ కారణంగా ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమీపంలోని కొన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. కొన్ని వాహనాలూ ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. రెస్టారెంట్ నిర్వాహకులు పని వేళలు ముగించే ముందు గ్యాస్ రెగ్యులేటర్లను విధిగా ఆపివేయాలని, తద్వారా ప్రమాదానాలను నియంత్రించవచ్చని అధికారులు సూచించారు. ఇంట్లో వాడే గ్యాస్ సిలెండర్ల విషయంలోనూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని వారు కోరారు. గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవడం ప్రమాదాల నివారణకు మంచి మార్గమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









