450 మంది షార్జా పోలీసులకు ఆర్థిక పదోన్నతి

- July 05, 2022 , by Maagulf
450 మంది షార్జా పోలీసులకు ఆర్థిక పదోన్నతి

షార్జా: పోలిస్ విభాగంలో చేరిన నాటి నుండి షార్జా పోలీసు విభాగంలోనే పనిచేస్తున్న 450 మంది నాన్ కమిషన్డ్ అధికారులకు ఆర్థిక పదోన్నతి ఇచ్చేందుకు షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహ్మద్ అల్ కసిమి అంగీకరించారు. 

నాన్ కమిషన్డ్ అధికారులు పోలీసింగ్ సంబంధించిన కోర్సును షార్జా పోలీస్ విభాగం అధ్వర్యంలో నడుస్తున్న షార్జా పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్నారు. 

షార్జా పోలీస్ విభాగ అధిపతి మేజర్ జనరల్ సైఫ్ అల్ జారీ షంశి ఆర్థిక పదోన్నతి అంశం గురించి షార్జా రేడియో మరియు టీవి ద్వారా ప్రకటించారు. ఈ సమయంలోనే పదోన్నతులు కల్పించిన షార్జా పాలకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 

షార్జా పోలీస్ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తన వంతు కృషి చేస్తున్న సుల్తాన్ కు మరియు పదోన్నతి పొందిన అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అధికారులను ఉద్దేశించి ప్రజల భద్రతా కోసం  పోలిస్ విభాగంలో పనిచేస్తున్న మీరు అంకిత భావంతో ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మేజర్ జనరల్ షంశి ఉద్ఘాటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com