మాజీ ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు
- April 12, 2016
బుడైయాలోని ఓ కెఫెటేరియా ఉద్యోగి, మాజీ ఉద్యోగి వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొడుతున్నాడనీ, హింసిస్తున్నాడనీ ఫిర్యాదులో బాధితుడు మొహమ్మద్ ఫైసల్ పేర్కొన్నారు. బుడైయాలోని కెఫెటేరియాలో పనిచేస్తున్న మొహమ్మద్ ఫైసల్, తనకు చెడ్డ పేరు వచ్చేలా ఆ మాజీ ఉద్యోగి వ్యవహరిస్తున్నాడనీ, అలాగే తన పాస్పోర్ట్ విషయంలోనూ వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించాడు. డబ్బు దొంగిలించినట్లుగా ఒప్పుకోవాలని తనపై మాజీ ఉద్యోగి వేధింపులకు దిగాడనీ, స్నేహితులతో కలిసి వచ్చిన అతడు తనను కొట్టాడని, 2000 బహ్రెయినీ దినార్ల కోసం ఇదంతా చేస్తున్నాడని ఫైసల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేక తాను ఉద్యోగం నుంచి బయటకు వచ్చాననీ, ఇండియన్ ఎంబసీ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫైసల్ వివరించాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







