మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి
- July 14, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ఓ వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అప్పీల్ను కాసేషన్ కోర్టు తిరస్కరించింది. కోర్టు అతనిపై విధించిన BD2,000 జరిమానాను ధృవీకరించింది. అతను జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తి మృతికి కారణమైనట్లు సదరు వ్యక్తిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న జిసిసి జాతీయుడు ఫోన్లో మాట్లాడుతూ.. తన వాహనాన్ని గంటకు 160 కిమీ వేగంతో పబ్లిక్ రోడ్డుపై నడిపి మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ (బహ్రెయిన్ దేశస్థుడు) అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







