మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి

- July 14, 2022 , by Maagulf
మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి

బహ్రెయిన్: మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ఓ వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అప్పీల్‌ను కాసేషన్ కోర్టు తిరస్కరించింది. కోర్టు అతనిపై విధించిన BD2,000 జరిమానాను ధృవీకరించింది. అతను జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తి మృతికి కారణమైనట్లు సదరు వ్యక్తిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న జిసిసి జాతీయుడు ఫోన్‌లో మాట్లాడుతూ.. తన వాహనాన్ని గంటకు 160 కిమీ వేగంతో పబ్లిక్ రోడ్డుపై నడిపి మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ (బహ్రెయిన్ దేశస్థుడు) అక్కడికక్కడే మరణించాడు. 

 
 
 

 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com