భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్.. 30 మంది అరెస్టు
- July 14, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ సరిహద్దు ప్రాంతాలలో భారీ మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలను బోర్డర్ గార్డ్స్ ల్యాండ్ పెట్రోలింగ్ బృందాలు అడ్డుకొని మొత్తం 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. జజాన్, నజ్రాన్, అసిర్లోని దక్షిణ ప్రాంతాలు, టబుక్లోని వాయువ్య ప్రాంతం నుండి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలలో 1.8 గ్రాముల కొకైన్తో పాటు 13 టన్నులకు పైగా ఉద్దీపన ఖాట్, 230 కిలోల హషీష్, 334,000 యాంఫెటమైన్ మాత్రలు, 278 గ్రాముల ఓపియం ఉన్నాయి. అరెస్టయిన స్మగ్లర్లలో 16 మంది సౌదీ పౌరులు, 14 మంది విదేశీయులు ఉన్నారు. విదేశీయులలో 11 మంది ఇథియోపియన్లు, సోమాలి, ఎరిట్రియన్, ఈజిప్షియన్ జాతీయులు ఉన్నారు. అరెస్టు చేసిన స్మగ్లర్లను భద్రతా అధికారులకు అప్పగించినట్లు సరిహద్దు గార్డ్స్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







