మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన షిండే సర్కారు
- July 14, 2022
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు సిఎం ఏక్నాథ్ షిండే శుభవార్త తెలిపారు. భారీగా పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత పదకొండు రోజులుగా రూ. 111.35 గా ఉన్న లీటరు పెట్రోలు తాజా తగ్గింపుతో రూ. 106.35కు తగ్గనుంది. ఇప్పటిదాకా రూ. 97.28గా ఉన్న లీటరు డీజిల్ ఇకపై 94.28 కే లభించనుంది.
ఇతర నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, గువాహటిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24, గువాహటిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









