పెను ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే సీతక్క
- July 16, 2022
తెలంగాణ: ములుగు ఎమ్మెల్యే సీతక్క పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు ప్రాంతంలోని చాల గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో సీతక్క పర్యటిస్తూ వస్తున్నారు. కాగా వరద సహాయక చర్యల్లో భాగంగా బోటుపై వెళ్తుండగా గోదావరి నదిలో బోటు ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆలా కాసేపటికి బోటు పక్కకు కొట్టుకు వచ్చి చెట్టుకు తగిలి ఒడ్డుకు చేరుకుంది. దీంతో అడవి మధ్యలో నుంచి కాలినడకన ఎమ్మెల్యే సీతక్క బయటకు వచ్చింది. ఈ ఘటన ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో జరిగింది.
వారం రోజులా పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు పలు ప్రాజెక్ట్ లు పొంగిపొర్లడం తో ముంపు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో వారంతా తినేందుకు తిండి లేక , తాగేందుకు మంచి నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో సీతక్క వారికీ సాయం చేసేందుకు కదం తొక్కింది. తనవంతు సాయం గా వారికీ ఆహారం , పండ్లు , కూరగాయలు , నిత్యావసర వస్తువులను అందజేస్తూ వస్తున్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్నవారికి, వరదల కారణంగా నష్టపోయిన వారికి సాయం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఎందరో పేదలు కనీసం ఆహారం కూడా లేక అలమటిస్తున్నారని, చేయిచేయి కలిపి వారందరినీ ఆదుకోవాలని కోరారు. సీతక్క పిలుపు మేరకు చాలామంది ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









