పి.వి.సింధు ని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం
- July 17, 2022
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022 లో అత్యంత ప్రతిభాపాటవాలు మరియు విశ్వాసాన్ని ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధు ను సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది.వరుస విజయాలతో దూసుకు పోతూ ఈఆటతో తన కెరియర్ లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్ తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్ను సొంతం చేసుకోవడం విశేషం.ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్ మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్ లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేసారు. తనను వ్యక్తిగతంగా కలిసి శుభాభినందనలు తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి సింధు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకొని , సింగపూర్ లో నివశించే తెలుగు వారికి సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు. సింగపూర్ తెలుగు సమాజం జూలై 31 న నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొననున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు 13న సింగపూర్ లో నివసించే తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీ లు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









