Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష
- July 22, 2022
దుబాయ్: Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఐదుగురు ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 3 నెలల జైలు శిక్ష వేసింది. ఒక ఆసియా డ్రైవర్కు చెందిన వాహనం నుండి 6,000 దిర్హాంతో పాటు 19 బాక్సుల ఎలక్ట్రానిక్ సిగరెట్లను దొంగిలించినందుకు వారికి ఈ శిక్షలను కోర్టు ఖరారు చేసింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటన గత మార్చిలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సీఐడీ బృందం విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని, వాటిలో ఒకటి రెండు వాహనాల ద్వారా దొంగిలించిన వస్తువులను రవాణా చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







