Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష
- July 22, 2022
దుబాయ్: Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఐదుగురు ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 3 నెలల జైలు శిక్ష వేసింది. ఒక ఆసియా డ్రైవర్కు చెందిన వాహనం నుండి 6,000 దిర్హాంతో పాటు 19 బాక్సుల ఎలక్ట్రానిక్ సిగరెట్లను దొంగిలించినందుకు వారికి ఈ శిక్షలను కోర్టు ఖరారు చేసింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటన గత మార్చిలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సీఐడీ బృందం విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని, వాటిలో ఒకటి రెండు వాహనాల ద్వారా దొంగిలించిన వస్తువులను రవాణా చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







