చేనేత కార్మికులకు రుణమాఫీ త్వరలో...

- April 13, 2016 , by Maagulf

త్వరలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమం, యువజన, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్‌ ఆదాయం పది శాతం పెరిగిందని అన్నారు. సరిహద్దుల్లో కల్తీ మద్యం అరికట్టడం వల్ల ఆదాయం పెంచుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని, 25వేల మంది లబ్దిదారులను గుర్తించి రూ.110 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com