భారత్ కరోనా అప్డేట్
- July 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,997కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,92,379గా ఉందని పేర్కొంది.
రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 1,50,100 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో 34,93,209 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 201.68 కోట్లకు చేరింది. వాటిలో 92.90 సెకండ్ డోసులు, 6.93 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..









