భారత్ కరోనా అప్డేట్
- July 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,997కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,92,379గా ఉందని పేర్కొంది.
రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 1,50,100 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో 34,93,209 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 201.68 కోట్లకు చేరింది. వాటిలో 92.90 సెకండ్ డోసులు, 6.93 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







