ఆన్ డ్యూటీలో సెల్ఫోన్ వినియోగాన్ని నియంత్రించాలి
- July 24, 2022
కువైట్: పనివేళల్లో సెల్ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పడిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే, కార్యాలయంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఫోన్లను ఉపయోగించకుండా నిరోధించడానికి మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా సంస్థకు ఎలాంటి చట్టం లేదని అధికార వర్గాలు తెలిపాయి. పని వేళల్లో గేమింగ్ సైట్లు లేదా అప్లికేషన్ల వినియోగాన్ని నిరోధించాలని నెటిజన్లు ప్రతిపాదన చేస్తున్నారు. మరికొందరు ఈ సమస్య తీవ్రమైనది, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పనిలో ఉన్న తన సహోద్యోగులకు చికాకు పెట్టడానికి, మొబైల్ ఫోన్ని అధికంగా ఉపయోగించడం వల్ల పనిని పూర్తి చేయడంలో ప్రభావితం చేస్తుందన్నారు. భద్రతా వ్యవస్థలు, ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ను మంత్రిత్వ శాఖ పరికరాలకు లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఏజెన్సీకి కనెక్ట్ చేసినప్పుడు రహస్య సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







