నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా

- July 24, 2022 , by Maagulf
నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా

రియాద్: తమకు కేటాయించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా నిప్పు పెడితే జరిమానా విధిస్తామని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు హెచ్చరించాయి. అడవులు లేదా జాతీయ ఉద్యానవనాలలో నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో మంటలు పెడితే SR 3,000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ తెలిపాయి. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబరులో పర్యావరణం లేదా వన్యప్రాణులపై దాడి చేసే ఏవైనా కేసుల సమాచారం ఉంటే తమకు తెలిపి సహకరించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. తాజాగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జెడ్డాలో తమ ఇన్‌స్పెక్టర్లు అరెస్టు చేసినట్లు పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక బలగాల అధికారులు ప్రకటించారు. . సూడాన్ జాతీయులు రాగిని సేకరించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేశారని, మట్టిని పాడు చేశారని స్పెషల్ ఫోర్సెస్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com