నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా
- July 24, 2022
రియాద్: తమకు కేటాయించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా నిప్పు పెడితే జరిమానా విధిస్తామని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు హెచ్చరించాయి. అడవులు లేదా జాతీయ ఉద్యానవనాలలో నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో మంటలు పెడితే SR 3,000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ తెలిపాయి. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబరులో పర్యావరణం లేదా వన్యప్రాణులపై దాడి చేసే ఏవైనా కేసుల సమాచారం ఉంటే తమకు తెలిపి సహకరించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. తాజాగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జెడ్డాలో తమ ఇన్స్పెక్టర్లు అరెస్టు చేసినట్లు పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక బలగాల అధికారులు ప్రకటించారు. . సూడాన్ జాతీయులు రాగిని సేకరించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేశారని, మట్టిని పాడు చేశారని స్పెషల్ ఫోర్సెస్ తెలిపింది.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







