నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా
- July 24, 2022
రియాద్: తమకు కేటాయించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా నిప్పు పెడితే జరిమానా విధిస్తామని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు హెచ్చరించాయి. అడవులు లేదా జాతీయ ఉద్యానవనాలలో నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో మంటలు పెడితే SR 3,000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ తెలిపాయి. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబరులో పర్యావరణం లేదా వన్యప్రాణులపై దాడి చేసే ఏవైనా కేసుల సమాచారం ఉంటే తమకు తెలిపి సహకరించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. తాజాగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జెడ్డాలో తమ ఇన్స్పెక్టర్లు అరెస్టు చేసినట్లు పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక బలగాల అధికారులు ప్రకటించారు. . సూడాన్ జాతీయులు రాగిని సేకరించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేశారని, మట్టిని పాడు చేశారని స్పెషల్ ఫోర్సెస్ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం









