అల్ హమ్రా బస్సు ప్రమాదంలో 5 మంది మృతి.. 14 మందికి గాయాలు

- July 24, 2022 , by Maagulf
అల్ హమ్రా బస్సు ప్రమాదంలో 5 మంది మృతి.. 14 మందికి గాయాలు

మస్కట్: విలాయత్ అల్ హమ్రాలోని అల్ జబల్ అల్-షార్కీలో 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.  బస్సు అల్ జబల్ అల్-షార్కి పర్వతాలకు విహారయాత్ర కోసం అనాథాశ్రమం నుండి పిల్లలను తీసుకువెళుతోందన్నారు. బస్సు విలాయత్ ఆఫ్ సీబ్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు చెందినదని తెలిపారు.  గాయపడిన వారిని నిజ్వా, బహ్లా ఆసుపత్రులకు తరలించినట్లు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మస్కట్ గవర్నరేట్‌లోని ఖవ్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com