అల్ హమ్రా బస్సు ప్రమాదంలో 5 మంది మృతి.. 14 మందికి గాయాలు
- July 24, 2022
మస్కట్: విలాయత్ అల్ హమ్రాలోని అల్ జబల్ అల్-షార్కీలో 19 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బస్సు అల్ జబల్ అల్-షార్కి పర్వతాలకు విహారయాత్ర కోసం అనాథాశ్రమం నుండి పిల్లలను తీసుకువెళుతోందన్నారు. బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లోని చైల్డ్ కేర్ సెంటర్కు చెందినదని తెలిపారు. గాయపడిన వారిని నిజ్వా, బహ్లా ఆసుపత్రులకు తరలించినట్లు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మస్కట్ గవర్నరేట్లోని ఖవ్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









