దుబాయ్ మెట్రోలో 'ఫ్రీ వైఫై'
- June 14, 2015
దుబాయ్ మెట్రో రైళ్ళలో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వైఫై అందుబాటులో ఉన్నా, వినియోగదారుల నుంచి కొంత ఛార్స్ వసూలు చేస్తున్నారు సర్వీస్ ప్రొవైడర్స్. అయితే రంజాన్, ఇతర అకేషన్స్ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ ప్రొవైడర్స్ మెట్రో రైళ్ళు, ఇతర ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచితంగా వైఫైని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికిది టెంపరరీ సర్వీస్ అయినా రానున్న రోజుల్లో పూర్తిగా ఉచితంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్ ట్రామ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, నాలెడ్జ్ విలేజ్, దుబాయ్ మీడియా సిటీ, ఎమ్మార్ బౌలెవార్డ్, గ్లోబల్ విలేజ్, డు షాప్స్ ఇవన్నీ వైఫై కనెక్టెడ్ ప్రాంతాలు ఇప్పటివరకూ. ఈ సంవత్సరం ‘డు’ సంస్థ దుబాయ్ మెట్రోతోపాటు యూఏఈలోని 200 ప్రాంతాల్లో వైఫైని అందుబాటులోకి తీసుకొస్తుంది. స్మార్ట్ యూఏఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







