దుబాయ్‌ మెట్రోలో 'ఫ్రీ వైఫై'

- June 14, 2015 , by Maagulf
దుబాయ్‌ మెట్రోలో 'ఫ్రీ వైఫై'

దుబాయ్‌ మెట్రో రైళ్ళలో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వైఫై అందుబాటులో ఉన్నా, వినియోగదారుల నుంచి కొంత ఛార్స్‌ వసూలు చేస్తున్నారు సర్వీస్‌ ప్రొవైడర్స్‌. అయితే రంజాన్‌, ఇతర అకేషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్‌ ప్రొవైడర్స్‌ మెట్రో రైళ్ళు, ఇతర ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచితంగా వైఫైని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికిది టెంపరరీ సర్వీస్‌ అయినా రానున్న రోజుల్లో పూర్తిగా ఉచితంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్‌ ట్రామ్‌, దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌, నాలెడ్జ్‌ విలేజ్‌, దుబాయ్‌ మీడియా సిటీ, ఎమ్మార్‌ బౌలెవార్డ్‌, గ్లోబల్‌ విలేజ్‌, డు షాప్స్‌ ఇవన్నీ వైఫై కనెక్టెడ్‌ ప్రాంతాలు ఇప్పటివరకూ. ఈ సంవత్సరం ‘డు’ సంస్థ దుబాయ్‌ మెట్రోతోపాటు యూఏఈలోని 200 ప్రాంతాల్లో వైఫైని అందుబాటులోకి తీసుకొస్తుంది. స్మార్ట్‌ యూఏఈ  కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com