ఇరాన్లో 5.3 భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు
- July 24, 2022
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 8:00 గంటలకు యూఏఈలో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారవర్గ నివేదికలు తెలిపాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8:07 గంటలకు భూకంపాన్ని నివాసితులు అనుభవించినట్లు NCM నివేదించింది. అయితే యుఎఇలో దాని ప్రభావం లేదని తెలిపింది. దక్షిణ ఇరాన్లో శనివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) శనివారం తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC వెల్లడించింది. ఈ భూకంపంలో ప్రాణ నష్టం గురించి ఇప్పుడే చెప్పలేమని, కాని దీనివల్ల పెద్ద ప్రాంతాలు దెబ్బతిన్నాయని హార్మోజ్గాన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ అధిపతి మొఖ్తర్ సలాషౌర్ చెప్పారు. మరోవైపు భూకంపాలు 5.7, 5.8 తీవ్రతతో వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తాజా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలో జూలై ప్రారంభంలో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించగా.. 49 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







