తెలంగాణ కరోనా అప్డేట్
- July 26, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది.రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36వేల 619 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 795 మందికి పాజిటివ్ గా తేలింది.అత్యధికంగా హైదరాబాద్ లో 343 కొత్త కేసులు వచ్చాయి.రంగారెడ్డి జిల్లాలో 54 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54 కేసులు, నల్గొండ జిల్లాలో 42 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 33 కేసులు, ఖమ్మం జిల్లాలో 32 కేసులు, కరీంనగర్ జిల్లాలో 25 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 658 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 15వేల 679 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 06వేల 865 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 703గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 28వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 581 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







