2024 తర్వాత ఐఎస్ఎస్కు రష్యా గుడ్ బై !
- July 27, 2022
మాస్కో: అంతర్జాతీయ రోదసీ స్టేషన్ (ఐఎస్ఎస్)ను 2024 తర్వాత విడిచి పెట్టాలని రష్యా నిర్ణయించింది. రష్యా రోదసీ సంస్థకి కొత్తగా నియమితులైన చీఫ్ యూరీ బొరిసొవ్ మంగవారం ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తెలిపారు.
ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యపై క్రెమ్లిన్కి, పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం, రష్యాపై కనివినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐసిసి) లో అమెరికా, రష్యా కలిసి మెలిసి పనిచేస్తున్నాయి. ''మా భాగస్వాములతో మేం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తాం. కానీ 2024 తర్వాత అంతర్జాతీయ స్టేషన్ను వీడి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామని యూరీ బొరిసొవ్ తెలిపారు.
అప్పటికల్లా రష్యా ఆర్బిటల్ స్టేషన్ను ప్రారంభిస్తామని అనుకుంటున్నామని చెప్పారు. రోదసీ కార్యక్రమం అమలే తమ ప్రధాన ప్రాధాన్యత అని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే 'గుడ్' అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఉక్రెయిన్పై గల ఉద్రిక్తతల వల్ల ప్రభావితం కాని రంగాల్లో రోదసీ అన్వేషణ రంగం ఒకటిగా వుంది. రోదసీ పరిశ్రమ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వుందని బొరిసొవ్ అన్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









