తదుపరి సీజేఐగా జస్టిస్ యుయు లలిత్: కేంద్రానికి జస్టిస్ రమణ సిఫార్సు
- August 04, 2022న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తదుపరి చీఫ్ జస్టిస్గా యుయు లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ నేడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రికమండేషన్ లెటర్ను కూడా జస్టిస్ లలిత్కు సీజేఐ రమణ అందజేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నుంచి బుధవారం రాత్రి సీజేఐ సెక్రటేరియేట్కు ఫోన్ కాల్ వెళ్లింది. తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని మంత్రి రిజుజు ఎన్వీ రమణను కోరారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26వ తేదీన ముగియనున్నది. ఆ తర్వాత జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే చాలా తక్కువ కాలమే జస్టిస్ లలిత్ ఆ పదవిలో ఉండనున్నారు. ఆయన నవంబర్ 8వ తేదీన రిటైర్ అవుతారు. జస్టిస్ లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రచూడ్ మాత్రం రెండేళ్లు సీజేఐగా చేసే ఛాన్సు ఉంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!