విమాన టికెట్‌ ధరలపై భారత్ కీలక నిర్ణయం

- August 11, 2022 , by Maagulf
విమాన టికెట్‌ ధరలపై భారత్ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: విమాన టికెట్‌ ధరలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి సమయంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్‌లను భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. గతంలో దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీల నియంత్రణకు ప్రైస్ బ్యాండ్ లను భారత ప్రభుత్వం విధించింది. కరోనా సంక్షోభం అనంతరం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోన్న నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com