దుబాయ్ వాసులకు హెచ్చరిక..
- August 18, 2022దుబాయ్: ఆన్లైన్ వేదికగా ఇతరులను అవమానపరిచే విధంగా సందేశాలు పంపించే దుబాయ్ వాసులను అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.సోషల్ మీడియాలో తోటివారిని అవమాన పరిస్తే 5లక్షల దిర్హాములు వరకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.ఈ మేరకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వీడియోను విడుదల చేసింది.డీరా ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ అల్ ముతావా మాట్లాడుతూ..ఆన్లైన్లో తోటివారిని అగౌరవపరిచే సందేశాలు పెట్టడం, అవమానపరుస్తూ మానసికక్షోభకు గురిచేయడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడేవారికి ఇకపై కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానాలు ఉంటాయన్నారు. 5లక్షల దిర్హాములు వరకు జరిమానా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఓ యువకుడు తనతో పాటు పనిచేసే సిబ్బందిని అవమాన పరిచేలా వాట్సాప్ లో సందేశంపంపించాడు.దాంతో అతడికి 10వేల దిర్హాములు జరిమానా విధించినట్లు చెప్పారు. అల్ ఐన్ న్యాయస్థానంలో ఇటీవల ఈ కేసు విచారణకు రావడంతో దోషిగా తేలిన యువకుడికి కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. అతని వల్ల బాధింపబడిన వ్యక్తికి ఈ జరిమానాను పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. దుబాయ్ ఆన్లైన్ చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను సదరు యువకుడికి ఈ భారీ జరిమానా పడిందని ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం