ఇంటర్ స్టేట్ గంజాయి ముఠాని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్

- August 22, 2022 , by Maagulf
ఇంటర్ స్టేట్ గంజాయి ముఠాని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్

హైదరాబాద్: అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెక్‌ పెట్టారు రాచకొండ పోలీసులు. ఒడిషా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది ముఠాలో అయిదుగురిని అరెస్ట్‌ చేశామని, మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ చెప్పారు. మూడు వేలకు కిలో చొప్పున కొనుగోలు చేసి 15వేలకు అమ్ముతున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 30 లక్షలు ఉంటుందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com