యూఏఈ మొదటి కమర్షియల్ మహిళా కెప్టెన్గా ఐషా అల్ మన్సూరి కొత్త చరిత్ర
- August 26, 2022
యూఏఈ: ఎతిహాద్ పైలట్ ఐషా అల్-మన్సూరి(33) మొట్టమొదటి మహిళా వాణిజ్య కెప్టెన్గా యూఏఈ విమానయాన రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. దేశం వార్షిక ఎమిరాటీ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా తనకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎతిహాద్ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్లో చేరి తన కెరీర్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కమర్షియల్ ఎయిర్లైన్స్లో కెప్టెన్గా పనిచేసిన మొదటి మహిళా ఎమిరాటీగా తను గర్వపడుతున్నానని, ఇది యువతులకు విమానయాన రంగంవైపు వచ్చేందుకు తను ఒక ప్రేరణగా నిలుస్తానని ఐషా అల్-మన్సూరి పేర్కొన్నారు. ఎతిహాద్ క్రూ బ్రీఫింగ్ సెంటర్లో జరిగిన కమాండ్ అప్గ్రేడ్ వేడుకలో ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహ్మద్ అల్ బులూకీ నుంచి కొత్త ర్యాంకును స్వీకరించారు. సూపర్ జంబో ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్బస్ A380ని నడిపిన మొదటి UAE జాతీయురాలుగా ఐషా ఇదివరకే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







